మాగంటి వంశీగారు మొదలుపెట్టిన ఆడియో పుస్తకాల ప్రయత్నంతో నాలో నాటుకున్న ఆలోచన, మొన్న కొత్తపాళీ, రవిగార్ల ప్రయత్నాలు చూసి మొలకెత్తి, భాస్కర రామిరెడ్డిగారు మొన్నటి టపాలో పెట్టిన కామెంటుతో చిగురించి, ఇదిగో ఇప్పుడిలా ఫలించింది.
నాకు సంగీతం రాదు, నేను రాగయుక్తంగా పద్యాలని పాడలేను. కాబట్టి అవి "వినసొంపు"గా అయితే ఉండవు. అసలందుకే వీటిని వినిపించడం ఎందుకని ఊరుకున్నాను. కాని భాస్కర్ గారు అన్నట్టు కనీసం పదాల సమాసాల ఉచ్చారణ, ఆసక్తి ఉన్నవాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుందని ఇప్పుడిలా సాహసం చేస్తున్నాను. ధైర్యం ఉన్నవాళ్ళు వినవచ్చు :-)
ప్రస్తుతం మనం విరాటపర్వంలో ఉన్నాం కదా. ద్రౌపది తనకు కీచకునివల్ల కలిగిన అవమానాన్ని భీముడికి వివరించి, తన బాధని అతనికి చెప్పుకుంటున్న సన్నివేశం. ఎలాంటి పాండవులు ఎలా అయిపోయారు అని దుఃఖపడుతోంది ద్రౌపది. ధర్మరాజు గొప్పతనం గంభీరంగా వర్ణించింది. అలాంటి అతను ఇప్పుడిలా పరుల పంచన చేరాడే అని వాపోయింది. భీముని బలపరాక్రమాలు సొగసుగా వర్ణించింది. అలాంటివాడు గరిటపట్టుకున్నాడే అని బాధపడింది. ఇప్పుడు అర్జునుడి వంతు.
పూర్తిగా చదవండి...