tag:blogger.com,1999:blog-29930082438768420712024-03-19T14:17:19.680+05:30తెలుగు పద్యంతెలుగు పద్యంకామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comBlogger134125tag:blogger.com,1999:blog-2993008243876842071.post-53626839244716597482014-10-22T23:16:00.001+05:302014-10-22T23:16:51.630+05:30తెలుగు యతి - తిరుగు మతి!"మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ
న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్
పళ్ళూడిన ముసిలిది కు
చ్చిళ్ళన్ సవరించినట్టు సిరిసిరిమువ్వా!"
నాకింకా పళ్ళు ఊడలేదు కానీ ఉన్నవాటిని ఊడగొట్టుకొనేందుకు మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ బ్లాగులో పోస్టు పెడదామనే దురాలోచన వచ్చింది. :-) దీనికి స్ఫూర్తినిచ్చిన పంతుల గోపాలకృష్ణగారికి ముందుగా కృతజ్ఞతలు. వారు ఛందస్సు ఫేసుబుక్కు గ్రూపులో యతి గురించి పెట్టిన చర్చ దీనికి కారణం. కొన్ని కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com66tag:blogger.com,1999:blog-2993008243876842071.post-7768892201852348002013-07-02T23:06:00.000+05:302013-07-02T23:10:08.987+05:30ఓ పలకరింపు టపాఈ బ్లాగు ద్వారా చాలామంది పాఠకలు మిత్రులయ్యారు. అందరూ ఇప్పటికీ మిత్రులే, పాఠకులవునో కాదో మాత్రం తెలియదు. :-) ఇంకా పాఠకులే అయిన మిత్రుల కోసం, మిత్రులు కాని పాఠకుల కోసం కూడా, బ్లాగు మూసెయ్య లేదన్న సూచనగా, ఒక చిన్న పలకరింపు టపా యిది, అంతే. పనిలో పనిగా కొంత సొంత ప్రోపగాండా కూడా చేసుకుందామని.
సుజనరంజని పత్రికలో "పద్యాలలో నవరసాలు" అనే శీర్షికతో ఒక వ్యాసపరంపర వ్రాస్తున్నాను, ఆరు నెలలుగా. అందులో యీ నెల కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com11tag:blogger.com,1999:blog-2993008243876842071.post-11651399899120445472013-04-11T15:38:00.002+05:302013-04-11T15:43:26.733+05:30వసంతవిజయం
పదిరోజుల కిందట హఠాత్తుగా మా యింటి మందారం, నిండా మొగ్గలతో నిండుగా కనిపించింది. అబ్బా! వసంతం వచ్చేసింది అనుకున్నా. ఆరునెలలయి ఒక్క పువ్వు కూడా పూయనిది రోజూ పూలతో కళకళలాడుతూ ఉంటే ఎంత సంబరంగా ఉందో! అదే కదా మరి పూల ఋతువు మహిమంటే!
"పేరంటమున కేగు పిన్నబాలిక వాలుజడ మల్లెమొగ్గ కన్పడినయంత" వసంతం వచ్చిందని తెలిసిందంటారు విశ్వనాథ, తన తెలుగు ఋతువులలో. వసంతమంటే కవులకి ఒక ప్రత్యేక అభిమానం. ఎక్కడెక్కడి కవికోకిలలకామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com13tag:blogger.com,1999:blog-2993008243876842071.post-46128754686315349942013-02-15T18:08:00.001+05:302013-02-15T19:35:14.966+05:30నన్నయ్యగారి గడుసుదనం
మన పూర్వకవుల రూపురేఖలు కానీ, వారి స్వరూపస్వభావాలు కానీ మనకి తెలియదు. వారివారి కవిత్వ లక్షణాల బట్టి కొంతా, వారి గురించి లభిస్తున్న ఇతరత్రా సమాచారం ద్వారా కొంతా, అనూచానంగా వచ్చే కథల ద్వారా మరికొంతా, కొందరికి కొన్ని ఊహాచిత్రాలను మనం కల్పించుకున్నాం. నన్నయ్యగారు అనేసరికల్లా ఒక శాంతగంభీర స్వరూపం మన మనసులో మెదులుతుంది. తిక్కన అనేసరికి, ఒక నిండైన విగ్రహం, ఒకింత తీక్ష్ణమైన చూపు, నిటారుగా నిలబడి కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com24tag:blogger.com,1999:blog-2993008243876842071.post-53686924415278461112013-01-24T20:40:00.000+05:302013-01-24T20:40:28.957+05:30సాపుటేరుపై సరదా పద్యం
చిన్నప్పుడు మన బళ్ళో తెలుగు తరగతిలో ప్రకృతి-వికృతులని చదువుకున్నాం గుర్తుందా?
ఆశ్చర్యము - అచ్చెరువు
భాష - బాస
పుస్తకము - పొత్తము
యిలా... ఇవన్నీ సంస్కృతంనుండి ప్రాకృతానికీ అక్కడినుంచి తెలుగుకీ వచ్చిన పదాలు కొన్ని, నేరుగా సంస్కృతం నుంచి వచ్చినవి కొన్నీను. వీటిలో మూల పదాల స్వరూపం మన భాషాస్వరూపానికి తగ్గట్టుగా మారడం గమనించవచ్చు. ఇవన్నీ ఎవరో తీరికూర్చుని తయారుచేసినవి కావు. ప్రజల నోళ్ళల్లో నలుగుతూ కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com25tag:blogger.com,1999:blog-2993008243876842071.post-68937566107952507292013-01-08T08:03:00.000+05:302013-01-08T11:08:48.725+05:30నన్నెచోడుని పద్యశిల్పం
మొన్న బెంగుళూరులో కొంతమంది నెణ్మిత్రులం (నెట్+మిత్రులు = నెణ్మిత్రులు :-)) కలుసుకున్నప్పుడు, నేనీ మధ్య బ్లాగు టపాలు బొత్తిగా తగ్గించేసానని కొందరు ముద్దుగా కోప్పడ్డారు. పండగలకే వ్రాస్తున్నానని మరొకరి సన్నాయి నొక్కు :-) ఇందులో నిజం లేకపోలేదు. కొంత ఆసక్తి తగ్గడం మాట అలా ఉంచితే, అసలు కారణం, వ్రాయడానికేమీ పెద్దగా లేకపోవడమే. ఏళ్ళ తరబడి అంతే కాంతితో వెలిగిపోడానికి నేనేమీ సూర్య నారాయణున్ని కాదు కదా! కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com15tag:blogger.com,1999:blog-2993008243876842071.post-12109649438116052502012-12-10T15:08:00.000+05:302012-12-10T15:08:22.666+05:30భక్తి స్మరియింతును శివశ్శివా యటంచు!
ఈ ఏటికివాళ ఆఖరి కార్తీకసోమవారం. ఏ పద్యాలతో యీ పరంపర ముగిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే చాలా పద్యాలే కనిపించాయి. తెలుగు కావ్యాలలో, శతకాలలో, శివస్తుతికి కరువు లేదు! ఆనాటి నన్నెచోడుని కుమారసంభవం నుండి, ఈ నాటి శ్రీరామలింగేశ్వర శతకం దాకా ఎన్నో ఉన్నాయి. కాని అయ్యవారి స్మరణ అమ్మవారు లేకుండా సంపుర్ణం కాదనిపించింది. అసలు వారిద్దరికీ ఎడమే లేదు కదా. అంచేత అర్ధనారీశ్వర రూపాన్ని తలచుకొని మంగళాంతం చేయడం కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com8tag:blogger.com,1999:blog-2993008243876842071.post-53826029525135977062012-12-03T05:00:00.000+05:302012-12-03T10:14:42.884+05:30ముక్కంటి! నా కింక దిక్కెవ్వరయ్య?
భక్తి అనేది చాలా విచిత్రమైనది. అది మనిషిని పూర్తిగా పరవశుణ్ణి చేస్తుంది. నిజమైన భక్తిలో ఆర్తి, వేదన, తపన, అమితమైన అనురాగమూ - యిలా ఎన్నెన్నో భావాలు పెనవేసుకుపోయి ఉంటాయి. ఈ కాలంలో అన్నిటితో పాటు భక్తికూడా కలుషితమైపోయింది కాని, పూర్వకాలంలోని భక్తుల కథలు చదివినా విన్నా ఒళ్ళు గగుర్పొడుస్తుంది! గాఢభక్తికీ, మూఢభక్తికీ తేడా చెప్పడం కష్టమే! అయినా భక్తికుండే శక్తి చాలా గొప్పదని అనిపిస్తుంది, వారి కథలు కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com7tag:blogger.com,1999:blog-2993008243876842071.post-55993476984875870052012-11-26T15:53:00.000+05:302012-11-26T15:53:46.098+05:30మృత్యుంజయా!
శివుడి మీద నాకు చాలా యిష్టమైన పద్యాలలో శ్రీ మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రిగారి "మృత్యుంజయా" పద్యాలు ముందువరసలో ఉంటాయి. వాటిలో హాస్యముంది, భక్తి ఉంది, ఆర్తి ఉంది, అధిక్షేపణ ఉంది. ఎన్నెన్నో భావాలొలికిస్తాయవి. వాటన్నిటిలోనూ అంతస్సూత్రంగా ఒకానొక ఆత్మీయత మెరిసిపోతూ ఉంటుంది.
పాపమీ కవి ఈశ్వరునికి తన గోడేదో చెప్పుకుందామనుకుంటాడు. అంతలోనే ఒక పెద్ద అనుమానం వచ్చిపడుతుంది! అసలు తన మొఱ ఆ యీశ్వరునికి కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com14tag:blogger.com,1999:blog-2993008243876842071.post-5812997516822630672012-11-19T05:00:00.000+05:302012-11-19T07:37:17.117+05:30దివ్వెలనెల
దివ్వెలనెల మొదలయ్యింది. నేలమీద నువ్వుల దివ్వె, నింగిపైన వెన్నెల దివ్వె. ఆకాశంలో వెలిగే ఆ రత్నదీపం శంకరునికి ఆభరణం. ప్రమిదలో దీపం అచ్చంగా జ్యోతిర్లింగ స్వరూపం. అందుకే యిది పరమశివునికి యిష్టమైన నెల. అందులోనూ కార్తీక సోమవారం మరింత ప్రీతికరం. అంచేత యీ రోజు శివుని గురించిన పద్యం చదువుకుంటే పుణ్యంపురుషార్థమూను!
తెలుగుసాహిత్యంలో శివునిపై కావ్యాలకీ, పద్యాలకీ కొదవలేదు. వాటన్నిటిలోనూ మకుటాయమానమయింది కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com6tag:blogger.com,1999:blog-2993008243876842071.post-47742756837209630342012-10-24T12:59:00.001+05:302012-10-24T14:13:11.458+05:30అమ్మల పండగ
విజయదశమి శుభాకాంక్షలు!
దసరా అంటే అమ్మల పండగే. అది నవ దుర్గలు కావచ్చు, ముగురమ్మలు కావచ్చు, ముగురమ్మల మూలపుటమ్మ కావచ్చు, విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, శ్రీశైల భ్రమరాంబ కావచ్చు, తెలంగాణ బతుకమ్మ కావచ్చు, మా ఊరి పైడితల్లమ్మ కావచ్చు, ఇంటింట వెలసిన ఇలవేల్పులు కావచ్చు. ఎవరైనా అమ్మలే. వీరందరితో పాటు, మనకు ప్రత్యక్షంగా కనిపించే మనకు జన్మనిచ్చిన అమ్మ కూడా వారి అంశే. ఆ అమ్మను, తల్లిదనాన్ని పూజించే పండగ దసరాకామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com3tag:blogger.com,1999:blog-2993008243876842071.post-34198476536061925572012-09-10T10:46:00.001+05:302012-09-10T10:46:57.202+05:30మృత్యుశోధన - శ్మశానం నుండి వైకుంఠం దాకా
ఈ మధ్య వరసగా మరణవార్తలు వినవలసి వచ్చింది. జువ్వాడి గౌతమరావుగారు, భద్రిరాజు కృష్ణమూర్తిగారు, నిన్నటికి నిన్న కొడవటిగంటి రోహిణీప్రసాద్గారు. యాదృచ్ఛికంగా నిన్ననే కలంకలలు బ్లాగులో యీ టపా చదివాను - వేదన నుంచి శోధన లోకి (జాషువా, శ్రీశ్రీ ఊతగా). అందులో పద్యాలు చదువుతూంటే నా మనసుకూడా ఏవేవో ఆలోచనల్లోకి జారిపోయింది.
ఎవరైనా ప్రముఖులు కాలధర్మం చేస్తే సంతాపం ప్రకటిస్తాం. ఎవరికోసమా సంతాపం? వారి కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com7tag:blogger.com,1999:blog-2993008243876842071.post-85693435541677473032012-08-03T16:45:00.001+05:302012-08-03T16:49:56.795+05:30విరటుని వాత్సల్యం
నేను తిక్కనగారి విరాటపర్వం కనీసం రెండు సార్లయినా చదివుంటాను. అయినా యింత చక్కని పద్యం ఇంతవరకూ నా దృష్టిలో పడకపోడం ఆశ్చర్యం. దృష్టిలో పడడమంటే ఆకట్టుకోడం. మనసుకు హత్తుకోడం. అందుకే కవిత్వాన్ని ఆస్వాదించడానికి సమయం సందర్భం నేపథ్యం చాలా అవసరమనేది. విరాటపర్వం అనగానే, ద్రౌపది "దుర్వారోద్యమ" లేదా "ఎవ్వాని వాకిట" పద్యమో, గోగ్రహణమప్పటి "సింగంబాకటితో", "వచ్చినవాడు ఫల్గునుడు" వంటి పద్యాలో గుర్తుకు వస్తాయి. కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com14tag:blogger.com,1999:blog-2993008243876842071.post-68632319226588091762012-04-20T10:00:00.002+05:302012-04-20T10:00:39.737+05:30ముసలివాని ప్రేమలేఖమొన్నీ మధ్య మిథునం కథ గురించి చర్చ చదివినప్పుడు, నేనెప్పుడో పదమూడేళ్ళ కిందట వ్రాసిన యీ పద్యకవిత గుర్తుకు వచ్చింది. సరే, కవిత పాతదైనా కొత్త మిత్రులతో పంచుకుందామని యిక్కడ పెడుతున్నాను. ఇది వ్రాసిన తర్వాత కూడా ఎవో పద్యాలు వ్రాస్తూనే ఉన్నాను కాని, యింతగా మనసుకి హత్తుకొన్న కవిత మరేదీ యీ పదమూడేళ్ళగా రానే లేదు! అప్పట్లో మనసుకున్న సున్నితత్వం క్రమేపీ మాయమైపోతూ ఉండడం దానికి కారణమేమో!
ప్రియమగు భార్య కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com22tag:blogger.com,1999:blog-2993008243876842071.post-55924422503735562942012-04-13T11:58:00.000+05:302012-04-13T11:58:35.536+05:30నను మెడబట్టి గెంటితివి...
నను మెడబట్టి గెంటితివి నాటకరంగముపైకి, చేత కా
దని బతిమాలుకొన్న వినవైతివి, కన్నులు విప్పి సభ్యులన్
గనుగొనినంత కాళ్ళు వడకన్ దొడగెన్ - సరికొత్త నర్తనం
బనుకొని చప్పటుల్ జరిచిరందరు, చాల్ తెరదింపుమో ప్రభూ!
మొన్ననీ పద్యమెందుకో హఠాత్తుగా గుర్తుకువచ్చింది. ఇదో తమాషా సన్నివేశం! కవి దేవునితో మొరబెట్టుకుంటున్నాడు. పద్యం సులభంగానే అర్థమవుతోంది కదా, వివరించాల్సిన పనిలేదు. జీవితాన్నో లోకాన్నో నాటకరంగంతో కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com6tag:blogger.com,1999:blog-2993008243876842071.post-27519545954599444572012-04-01T14:13:00.000+05:302012-04-01T14:13:49.343+05:30జానక్యాః కమలామలాఞ్జలిపుటే...
జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః
స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః
పూర్వం తెలుగువారి పెళ్ళి శుభలేఖలపైన యీ పద్యం తరచూ కనిపించేది. ఇది సీతారాముల పెళ్ళివేడుకలో ముత్యాల తలంబ్రాలను వర్ణించే పద్యం. పెళ్ళి శుభలేఖ మీద యీ శ్లోకం ఎందుకంటే, సీతారాముల పెళ్ళంత వైభవంగానూ తమ పెళ్ళివేడుక కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com17tag:blogger.com,1999:blog-2993008243876842071.post-17068593021857754612012-03-01T21:32:00.000+05:302012-03-01T21:36:13.788+05:30అదిగో ద్వారక...
అదిగో ద్వారక! ఆలమందలవిగో అందందు గోరాడు! అ
య్యదియే కోట, అదే అగడ్త, అవె రథ్యల్, వారలే యాదవుల్!
యదుసింహుండు వసించు మేడ యదిగో! ఆలాన దంతావళా
భ్యుదయంబై వర మందురాంతర తురంగోచ్చండమై పర్వెడిన్!
ఆఁ.. ఆఁ... వినిపిస్తున్నాయ్... మీ ఈలలూ వన్సుమోర్లూ! :-) ఇదిగో మళ్ళీ వినండి.
తన కాలానికి ప్రచారంలో ఉన్న పద్యనాటక సంపదాయ ధోరణిని కాదని, పద్యాలు పాడడంలో ఒక కొత్త సంప్రదాయాన్ని కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com14tag:blogger.com,1999:blog-2993008243876842071.post-36415375488880543132012-01-27T09:59:00.002+05:302012-01-27T09:59:43.919+05:30నిరుపహతి స్థలం...
నిరుపహతిస్థలం మృదుతరాసన మొళ్ళుణి సింపుదంబులం
నరపిద పుస్తకప్రతతి లేఖకవాచకసంగ్రహం నిరం
తర గృహనిశ్చితస్థితి విచారకసంగతి సత్కళత్ర సా
దరతయి నుళ్ళ సత్కవియు మీసువదాగదె కావ్యవార్ధియం
ఇదే భాషో గుర్తుపట్టారుగా, కన్నడం. మరి పద్యాన్ని కూడా గుర్తుపట్టారా? ఆఁ... అవునదే... పెద్దనగారి చాటువు. ఒకేసారి రెండు భాషల్లో సినిమా విడుదల చేసినట్టు పెద్దనగారు కూడా ఒకేసారి తెలుగు కన్నడ భాషల్లో యీ చాటువు చెప్పేరనుకుంటే కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com12tag:blogger.com,1999:blog-2993008243876842071.post-57017606513606981842012-01-14T22:16:00.000+05:302012-01-14T23:13:33.379+05:30సంక్రాంతి శుభాకాంక్షలు!
సంక్రాంతి శుభాకాంక్షలు!
ఈసారి పండక్కి ఊరు వెళ్ళలేదు. అంచేత తలపోతలు కలబోతలూ ఏమీ లేవు. చుట్టాలుపక్కాలతో కలవకపోతే పండక్కి, అందులోనూ సంక్రాంతికి కళేముంటుంది? అయినా యథారీతి పొద్దున్నే లేచి యథాశక్తి భోగి మంట వేశాం. తమిళవాళ్ళు కూడా భోగి మంట వేస్తారు. డప్పులాంటి వాద్యాన్ని వాయించి మరీ! అయితే రెండు మూడిళ్ళవాళ్ళు తప్పించి పెద్దగా ఎవ్వరూ వెయ్యలేదు. నాలుగురోజులుగా తగ్గిందనుకున్న చలి మాత్రం కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com4tag:blogger.com,1999:blog-2993008243876842071.post-24138003585596035272011-12-30T19:55:00.000+05:302011-12-30T19:59:54.471+05:30పెళ్ళాల పాదతాడనం దేవుళ్ళకి శిరోధార్యం - తరువాయి భాగంక్రిందటి టపాలో సత్యాపతి తన ప్రియసతి పదపల్లవ తాడననాన్ని రుచిచూసిన సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నాం కదా. అతను కాక (అంత కన్నా ముందే) ఆ సత్కారాన్ని పొందిన ఆ మరో దేవుడెవరో తెలుసుకోడానికి ఉవ్విళ్ళూరుతున్నారా?:-) ఆ దేవుడు ఆదిదేవుడు, శంకరుడు. దాని గురించి చెప్పినది స్వయంగా ఆదిశంకరులు. ఆ అయ్యవారు అమ్మవారి పాదతాడనాన్ని పొందడమే కాదు, అది పొందాలని ఉవ్విళ్ళూరారట కూడా!
నమోవాకం బ్రుమో నయన రమణీయాయ పాదయోః
త కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com8tag:blogger.com,1999:blog-2993008243876842071.post-42977398108124503842011-12-22T14:01:00.000+05:302011-12-22T14:11:05.588+05:30పెళ్ళాల పాదతాడనం దేవుళ్ళకి శిరోధార్యం!భార్య పాదతాడనం రుచిచూసిన దేవుడనగానే మనకి గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడొక్కడే. అదికూడా, మన నంది తిమ్మనగారి పుణ్యమా అని తెలుగు కృష్ణుడికి మాత్రమే దక్కిన భాగ్యమది. మరి టపా శీర్షికలో "దేవుళ్ళు" అని బహువచనమేమిటి? మరో దేవుడు కూడా భార్య చేత తన్నించుకున్నాడా?! అన్న అనుమానం ఈపాటికి మీకు కలిగుండాలి. అవును, భార్య చేత తలదన్నించుకున్న దేవుడు మరొకడున్నాడు. అసలు నంది తిమ్మనగారి కృష్ణుడికి స్ఫూర్తినిచ్చింది కూడా కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com10tag:blogger.com,1999:blog-2993008243876842071.post-57446938476258774902011-12-15T15:30:00.000+05:302011-12-15T15:29:19.399+05:30చెప్పుకోండి చూద్దాం! - సమాధానం
శ్రీశ్రీ సిప్రాలి గురించిన టపా వ్యాఖ్యలలో, అచ్చులతో ప్రాస ఉన్న పద్యానికి ఉదాహరణగా కందిశంకరయ్యగారు కవిజనాశ్రయంనుండి యీ క్రింది పద్యాన్ని ఉదహరించారు:
అ ఆ ఐ ఔ లకు మఱి
ఇ ఈ లు ఋకారసహిత మె ఏ లకు నౌ
ఉ ఊ ల్దమలో నొడఁబడి
ఒ ఓ లకు వళ్లగు న్నయోన్నతచరితా!
ఇది యతుల గురించి వివరించే పద్యం. ఏయే అచ్చులకి యతిమైత్రి ఉన్నదో చెపుతోంది. ఈ పద్యంలో అచ్చుల ప్రాసతో పాటు, ఛందస్సుకి సంబంధించి మరొక విశేషం కూడా ఉంది! కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com6tag:blogger.com,1999:blog-2993008243876842071.post-31459199322168180962011-11-27T14:42:00.000+05:302011-11-27T18:26:49.946+05:30కంకంటి కవిత్వంఇంతకు బూని వచ్చి వచియింపక పోదునె? విన్ము తల్లి! దు
శ్చింతులు దైత్యు చేబడిన సీతను గ్రమ్మఱ నేలుచున్నవా
డెంత విమోహి రాముడని యెగ్గులు వల్కిన నాలకించి భూ
కాంతుడు నిందజెంది నిను గానలలోపల డించి రమ్మనెన్
ఈ పద్యమూ, యీ సన్నివేశమూ అందరికీ సుపరిచితమే. సీతమ్మను అడవిలో వదిలిపెట్టడానికి తీసుకువచ్చిన లక్ష్మణుడి కంట కన్నీరు చూసి సీతాదేవి ఆందోళన పడి ఏమిటని అడుగుతుంది. పూర్వం వనవాసం చేసినప్పుడు కాని, ఇంద్రజిత్తుతోకామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com60tag:blogger.com,1999:blog-2993008243876842071.post-34275841668436034112011-11-07T20:10:00.002+05:302011-11-07T20:59:17.754+05:30శ్రీవికటకవిస్కీఇవాళ తీరిగ్గా కూర్చొని అల్మారాలోంచి గుడ్డివేటుగా ఓ పుస్తకం తీస్తే "సిప్రాలి" చేతికొచ్చింది. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ అయినట్టుగా, సిరిసిరిమువ్వ ప్రాసక్రీడలు లిమఋక్కులు కలిసి సిప్రాలి. ఎఱ్ఱటి అట్టమీద చెయ్యెత్తి ఏదో ఆవేశంగా చదువుతున్న శ్రీశ్రీ నలుపుతెలుపుల ఛాయాచిత్రం. చూస్తే నవ్వొచ్చింది. శ్రీశ్రీ ఒఠ్ఠి ఎఱ్ఱకవీ కాదూ, అతనిది నలుపుతెలుపుల వ్యక్తిత్వమూ కాదు. అతనిలో ఉన్న అనేక రంగులకీ అనేక ఛాయలకీ కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com19tag:blogger.com,1999:blog-2993008243876842071.post-16293518634055945882011-10-25T22:55:00.000+05:302011-10-25T22:55:19.786+05:30దీపావళి చందమామటపా శీర్షిక చూసి, అమావాస్య చంద్రుడిలా దీపావళి చందమామ యేమిటని కంగారు పడకండి :-) దీపావళి నాడు ఆకాశంలో చందమామ కనిపించడు కనుకనే యీ బ్లాగాకాశంలోనైనా అతణ్ణి ఉదయించేట్టు చేద్దామని చిన్న కోరిక. నరకుడిని కృష్ణుడు చంపాడనో, రావణుణ్ణి రాముడు చంపాడనో దీపావళి చేసుకుంటారన్నది పైపై మాటలేననీ, అసలు రహస్యం మరొకటి ఉందనీ నా అనుమానం. ఏమిటంటారా? చెపుతాను, సావధానంగా వినండి. దీపావళి ఎప్పుడు వస్తుంది? అమావాస్యనాడు. అది కామేశ్వరరావుhttp://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.com23